జగన్తో మంచి సంబంధాలు.. అయినా: కేటీఆర్
రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రానున్నాయని, త్వరలోనే ప్రకటనలు ఉంటాయని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. ట్విటర్ వేదికగా ‘ఆస్క్ కేటీఆర్’ సెషన్లో..
రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం
‘ASK KTR’ సెషన్లో తెలంగాణ మంత్రి
హైదరాబాద్: రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రానున్నాయని, త్వరలోనే దీనిపై ప్రకటనలు ఉంటాయని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. ట్విటర్ వేదికగా ‘ASK KTR’ సెషన్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కుల కోసం పూర్తి స్థాయిలో పోరాడతామన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు. యువతకు ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శి అని అభివర్ణించారు. వైద్య రంగంలో మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. కరోనా మహమ్మారి ఆ అవసరాన్ని స్పష్టంగా గుర్తు చేసిందని పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్తో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏడాదిలో టీఫైబర్ పనులు పూర్తవుతాయని చెప్పారు.
కరోనా చికిత్సకు సంబంధించి రెండు ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకున్నామని కేటీఆర్ వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స కోసం అన్ని రకాల సదుపాయాలు కల్పించామని వివరించారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలని కోరారు. ప్రస్తుతం రోజుకు 23వేల కొవిడ్ నిర్ధరణ పరీక్షలను చేస్తున్నామన్నారు. త్వరలోనే ఈ సంఖ్యను 40వేలకు పెంచుతామని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్య శ్రీ మెరుగైన పథకమని చెప్పారు. గాంధీ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఎంతో విలువైన సేవలను అందిస్తున్నారని అభినందించారు. కరోనాకు మొదటి వ్యాక్సిన్ తెలంగాణ నుంచే వస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఇతర దేశాల నుంచి వచ్చినా సంతోషమేనన్నారు. ప్రజా రవాణా తిరిగి ప్రారంభించే విషయంలో కేంద్రం అనుమతి కోసం వేచి చూస్తున్నామని వెల్లడించారు. కరోనా పరీక్షల విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిక లేదని స్పష్టం చేశారు. స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించారు. టీఎస్ బీపాస్ పట్టణ సంస్కరణల్లో బెంచ్ మార్క్గా నిలుస్తుందన్నారు. ఎక్కువ సీసీటీవీ కెమెరాలు ఉన్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి కావడం గర్వకారణమని చెప్పారు. నేరాల నియంత్రణకు కెమెరాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ నెల మూడో వారంలో దుర్గం చెరువు తీగల వంతెన ప్రారంభిస్తామని కేటీఆర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!