TS: మంత్రి మల్లారెడ్డి దంపతులకు కరోనా

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి దంపతులకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా...

Updated : 08 Aug 2020 21:59 IST

వీడియో ద్వారా వెల్లడించిన తెలంగాణ మంత్రి

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి దంపతులకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వీడియో ద్వారా తెలిపారు. ప్రస్తుతం మంత్రి హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వీడియోలో మల్లారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్నానని అన్నారు. ధైర్యంగా, జాగ్రత్తగా ఉంటే కరోనాను జయించవచ్చని చెప్పారు. 

తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. హైదరాబాద్‌ జూబ్లీ హిల్స్‌  అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ రెండు వేలు దాటాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2,256 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య,ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77,513కి చేరింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 14 మంది ప్రాణాలు కోల్పోవడంతో.. మొత్తం మృతుల సంఖ్య 615కి పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని