Tandur Redgram: తాండూరు కందిపప్పునకు భౌగోళిక గుర్తింపు
తాండూరు కందిపప్పునకు (Tandur Redgram) అరుదైన గుర్తింపు లభించింది. రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా పండించే ఈ కందిపప్పునకు భౌగోళిక గుర్తింపు (GI tag) లభించినట్లు కేంద్రం వెల్లడించింది.
దిల్లీ: తాండూరు కందిపప్పునకు (Tandur Redgram) అరుదైన గుర్తింపు లభించింది. రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా పండించే ఈ కందిపప్పునకు భౌగోళిక గుర్తింపు (GI tag) లభించినట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో పాటు అస్సాం గమోసా, లద్దాఖ్ యాప్రికాట్, మహారాష్ట్రకు చెందిన అలీబాగ్ వైట్ ఆనియన్కు సైతం జీఐ ట్యాగ్ లభించిందని వాణిజ్య పరిశ్రమల శాఖ బుధవారం తెలియజేసింది. వీటితో దేశవ్యాప్తంగా భౌగోళిక గుర్తింపు పొందిన వాటి సంఖ్య 432కి చేరిందని పేర్కొంది.
జీఐ ట్యాగ్ సాధించిన రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. దేశంలో బాస్మతి రైస్కు, డార్జిలింగ్ టీ, చందేరి ఫ్యాబ్రిక్కు, మైసూర్ సిల్క్, కాంగ్రా టీ.. ఇలా చాలా వాటికి ఈ జీఐ ట్యాగ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి బనగానపల్లి మామిడి, బొబ్బిలి వీణ, ధర్మవరం చేనేత పట్టుచీరలు, నిమ్మలకుంట తోలుబొమ్మలు, ఉప్పాడ జామ్దానీ చీరలు, తెలంగాణలోని పోచంపల్లి ఇక్కత్, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, హైదరాబాద్ లాడ్ బజార్ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి.
ఏమిటీ తాండూరు కంది పప్పు ప్రత్యేకత?
ఇతర ప్రాంతాల్లో పండించిన కందిపప్పు కంటే దాని రుచి తాండూరు కందిపప్పును ప్రత్యేక స్థానంలో నిలబెడుతుంది. ఈ పప్పు త్వరగా ఉడకడమేకాకుండా త్వరగా పాడవకుండా ఉంటుంది. దేశంలో పలు రాష్ట్రాల్లో తాండూరు కందిపప్పు పేరుతో దీన్ని విక్రయిస్తారంటే దీని ప్రత్యేకత గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఏటా తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంటుంది. ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, యూపీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు సైతం ఎగుమతి అవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్గా పీహెచ్డీ రామక్రిష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం