Sabitha Indrareddy: 24 నుంచి వెబ్‌సైట్‌లో పదో తరగతి హాల్‌టికెట్లు: మంత్రి సబిత

తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై విద్యా శాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్షించారు. ఈనెల 24వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

Updated : 18 Mar 2023 20:05 IST

హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి పరీక్షల హాల్‌టికెట్లు ఈనెల 24వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై విద్యా శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థుల కోసం 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి ఉదయం 9.30 గంటల నుంచి 12.30వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. 

ఆరు పేపర్లతో 9,10 పరీక్షలు...

తొమ్మిది, పదో తరగతి పరీక్షల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక నుంచి 9, 10 తరగతులకు ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23 నుంచి సంస్కరణలు అమలు అవుతాయని పేర్కొంది. ఒక్కో సబ్జెక్ట్‌లో పరీక్షలకు 80, ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌కు 20 మార్కులు కేటాయిస్తున్నట్లు తెలిపింది. సైన్స్‌ పేపర్‌లో ఫిజిక్స్‌, బయాలజీకి చెరి సగం మార్కులు ఉంటాయని వెల్లడించింది. సైన్స్‌ పరీక్షకు 3.20 నిమిషాల సమయం కేటాయించగా.. మిగతా అన్ని సబ్జెక్టులకు 3 గంటలు పరీక్షా సమయం ఉంటుందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు