శృంగేరి శారదా పీఠంలో దిగ్విజయంగా తెలంగాణ విద్వత్‌ సభ సత్సంగం

కర్ణాటక శృంగేరి శారదా పీఠం జగద్గురువులు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారి సన్నిధానంలో దర్శనం వెంకటరమణశర్మ ఆధ్వర్యంలో ఈ నెల 2న తెలంగాణ విద్వత్‌ సభ సత్సంగం దిగ్విజయంగా జరిగింది.

Updated : 04 Dec 2022 00:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కర్ణాటక శృంగేరి శారదా పీఠం జగద్గురువులు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి సన్నిధానంలో దర్శనం వెంకటరమణశర్మ ఆధ్వర్యంలో ఈ నెల 2న తెలంగాణ విద్వత్‌ సభ సత్సంగం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా ప్రముఖ జ్యోతిష పండితులు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి సంపూర్ణ సిద్ధాంత గణితాన్ని స్వామికి సమర్పించారు. ఈ సందర్భంగా శృంగేరి ఆస్థాన జ్యోతిర్విద్వాంసులు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి, ఆయన కుమారుడు శంకరమంచి శివ రచించిన ‘‘శ్రీ శంకరమంచి వారి శోభకృత్‌ నామసంవత్సరం 2023-2024 పంచాంగం’’ను జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి ఆవిష్కరించారు. మోహన్ పబ్లికేషన్స్‌లో ఈ పంచాంగాన్ని ముద్రించారు. 

ఈ కార్యక్రమంలో విద్వత్‌ సభ సమన్వయకర్త భీమ్‌ సేన్‌ మూర్తి, కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతి, కోశాధికారి వెంకటరమణ శర్మ, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జగన్మోహన్‌ శర్మ, శృంగేరి ఆస్థాన జ్యోతిష పండితులు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి, శంకరమంచి శివ సిద్ధాంతి, నరేశ్‌ కులకర్ణి, ప్రశాంత్‌ జోషి, నాగరాజు శర్మ, లక్ష్మి వెంకటేశ్వర్మ శాస్త్రి, నాగేశ్వరరావు, హనుమంతాచార్యులు, దత్తాత్రేయశర్మ, రాధాకృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని