Telangana news: తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు
తెలంగాణ కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి తగిన చర్యలు చేపట్టాలని సీఎస్ సోమేశ్కుమార్ను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రధాన పరిపాలనా సముదాయ భవనమైన సచివాలయానికి భారత సామాజిక దార్శనికుడు, మహామేధావి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమన్న సీఎం.. ఈ నిర్ణయం దేశానికే ఆదర్శమని అన్నారు. దేశ ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలన్న అంబేడ్కర్ తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతోందన్నారు. అన్ని రంగాల్లో సబ్బండ వర్గాలను సమున్నత స్థాయిలో నిలుపుతూ కొనసాగిస్తున్న స్వయం పాలన అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిందని వివరించారు. దీని వెనుక అంబేడ్కర్ ఆశయాలు ఇమిడి ఉన్నాయన్న ముఖ్యమంత్రి.. ఆయన దార్శనికతతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా వర్గాలతో పాటు పేదలైన అగ్రకులాల ప్రజలకు కూడా మానవీయ పాలన అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం అంబేడ్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేస్తోందని కేసీఆర్ తెలిపారు.
అంబేడ్కర్ స్ఫూర్తి మమ్మల్ని నడిపిస్తోంది...
సమాఖ్య స్ఫూర్తి అమలు ద్వారానే అన్ని వర్గాలకు సమాన హక్కులు, అవకాశాలు లభిస్తాయన్న అంబేడ్కర్ స్ఫూర్తి తమను నడిపిస్తోందన్నారు. కుల, మత, లింగ, ప్రాంత వివక్ష లేకుండా అన్ని వర్గాలకు సమాన గౌరవం లభించి, అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే నిజమైన భారతీయత అని పేర్కొన్నారు. అప్పుడే నిజభారతం ఆవిష్కృతమవుతుందని, అందుకోసం తమ కృషి కొనసాగుతుందని సీఎం తెలిపారు. అన్ని రంగాల్లో దార్శనికతతో ముందుకు సాగుతూ అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ.. అంబేడ్కర్ పేరును సచివాలయానికి పెట్టడం ద్వారా మరోసారి దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. భారత నూతన పార్లమెంట్ భవనానికి కూడా అంబేడ్కర్ పేరు పెట్టాలని ఆషామాషీకి కోరలేదన్న సీఎం కేసీఆర్.. దేశ గౌరవం మరింతగా ఇనుమడించాలంటే ఆయన పేరును మించిన పేరు లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించిందని, ఇదే విషయమై ప్రధానికి త్వరలోనే లేఖ రాస్తానని సీఎం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని కొత్త పార్లమెంట్ భవనానికి బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మరో మారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్