Chennamaneni Ramesh: చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదంపై హైకోర్టులో విచారణ
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదంపై మరోసారి హైకోర్టులో విచారణ జరిగింది. చెన్నమనేని ద్వంద్వ పౌరసత్వం
హైదరాబాద్: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదంపై మరోసారి హైకోర్టులో విచారణ జరిగింది. చెన్నమనేని ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ గతంలో ఆది శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతకొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఏడాది క్రితం కేంద్ర హోంశాఖ చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంపై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. భారత పౌరసత్వంతోనే చెన్నమనేని జర్మనీ వెళ్లొచ్చారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. రమేశ్ జర్మనీ పౌరుడేనని.. ఇప్పటికీ అక్కడే ఉన్నారని పిటిషనర్ ఆది శ్రీనివాస్ మరోసారి న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ వివాదానికి సంబంధించి చాలా పత్రాలు ఉన్నందున పుస్తకం రూపంలో ఇవ్వాలని ఆదేశించిన ఉన్నత న్యాయస్థానం విచారణను ఆగస్టు 11కి వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!