Heavy Rains in Telangana: జల దిగ్బంధంలో నిర్మల్, భైంసా
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తుండటంతో స్వర్ణ, కడెం, భైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద
భైంసా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తుండటంతో స్వర్ణ, కడెం, భైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఒక్కసారిగా గేట్లు ఎత్తి నీరు వదిలేయడంతో భైంసా ఆటోనగర్లోని ఇళ్లను వరద నీరు చుట్టుముట్టింది. ఆటోనగర్, ఎన్.ఆర్.గార్డెన్ ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. వరద నీటిలో చిక్కుకుపోయిన దాదాపు 150 మందిని అగ్నిమాపక సిబ్బంది, గజఈతగాళ్లు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భైంసా ఎన్.ఆర్.గార్డెన్లో బస చేసిన 20 మంది పోలీసులు వరద నీటిలో చిక్కుకుపోవడంతో బోట్ల సాయంతో వారిని గజఈతగాళ్లు రక్షించారు. వరద నీరు పెద్ద ఎత్తున రావడంతో ఆటోనగర్, ఎన్.ఆర్.గార్డెన్ ప్రాంతాల్లో దాదాపు 60 కుటుంబాలు వరద నీటిలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. స్వర్ణ జలాశయం ఆరు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదలడంతో ఉప్పొంగి ప్రవహిస్తోంది. స్వర్ణ వాగుకు సమీపంలో గల జిల్లా కేంద్రంలోని సిద్ధాపూర్లోని జీఎన్ఆర్ కాలనీలోకి వరద నీరు వచ్చి చేరడంతో నీట మినిగింది. కాలనీలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఉదయం నుంచి తాగడానికి మంచినీళ్లు లేక, ప్రాణాలు రక్షించుకునేందుకు ఇళ్లపైకి చేరి బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్నారు. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖీ, జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఫైర్ ఇంజన్, పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని తాళ్లు, తెప్పల సాయంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు.
వరద పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష
నిర్మల్, భైంసాలో వరద పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిర్మల్లో చేపట్టిన సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. నిర్మల్కు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపుతున్నట్టు తెలిపారు. ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఏ ఒక్కరి ప్రాణం పోకుండా కాపాడటమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్