Crime News: 300 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్టు

నగరంలో గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేసినట్లు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు..........

Updated : 16 Oct 2021 14:44 IST

హైదరాబాద్: నగరంలో గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేసినట్లు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. నిందితుల నుంచి 300కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. మూసారాంబాగ్‌, మలక్‌పేట్‌ ప్రాంతాల్లో గంజాయి తరలిస్తున్న వాహనాన్ని గుర్తించి 10 బస్తాల్లోని 300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీని విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందన్నారు. ఈ కేసులో రెండు మొబైల్‌ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సీపీ చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని