AP Floods: వరదలతో కోవూరు అతలాకుతలం.. 70 ఇళ్లు నేలమట్టం!
నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని పడుగుపాడు పంచాయతీ పరిధి నేతాజీ నగర్లో 70 ఇళ్లు నేలమట్టమయ్యాయి.
కోవూరు: నెల్లూరు జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు నదుల్లో భారీగా వరద పోటెత్తిన విషయం తెలిసిందే. సోమశిల నుంచి దిగువకు వస్తున్న వరదనీరు తగ్గుముఖం పట్టినా.. నదీ పరీవాహక ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. అనంత సాగరం నుంచి నెల్లూరు నగరం మీదుగా ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు వరకు అనేక గ్రామాలు నీట మునిగాయి. ఈ క్రమంలో కోవూరు మండలంలోని పడుగుపాడు పంచాయతీ పరిధి నేతాజీ నగర్లో ముంపు కారణంగా సుమారు 200 ఇళ్లు నాలుగు రోజులుగా వరదనీటిలో నీటిలోనే నానుతున్నాయి. వాటిలో సుమారు 70 ఇళ్లు ఇవాళ కూలిపోయాయి.
దీంతో ఆ ఇళ్లల్లోని ఫ్యాన్లు, ఫ్రిజ్లు, టీవీలు, నిత్యావసర సరకులు నీటిలో మునిగిపోయాయి. ఫలితంగా భారీగా ఆస్తి నష్టం ఏర్పడింది. మరికొన్ని గృహాల్లోని సామగ్రి వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిలు ఈ మధ్యాహ్నం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారని జిల్లా వ్యవసాయ మండలి ఛైర్మన్ నిరంజన్బాబు రెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ