TSRTC: తెల్లవారుజాము 4 గంటల నుంచే బస్సులు
కరోనా భయాలు తొలగి ప్రజారవాణాకు డిమాండ్ పెరుగుతుండడంతో వేకువజాము నుంచే బస్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది ఆర్టీసీ. ముందుగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లతోపాటు
ఈనాడు, హైదరాబాద్: కరోనా భయాలు తొలగి ప్రజారవాణాకు డిమాండ్ పెరుగుతుండడంతో వేకువజాము నుంచే బస్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది ఆర్టీసీ. ముందుగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లతోపాటు ఎంజీబీఎస్, జేబీఎస్ల నుంచి కూడా వేకువజామునే బస్సులుండేలా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు బస్సుల్లో ప్రయాణించి రద్దీని అంచనా వేసి అవసరమైన మేరకు బస్సులను పెంచే చర్యలు చేపట్టారు.
హయత్నగర్- కోఠి మధ్య అదనంగా 12 సర్వీసులు..
నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్ల నుంచి ఉదయం 4 గంటలకే అన్ని ప్రాంతాలకు సిటీ బస్సులు బయలుదేరుతున్నాయని గ్రేటర్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు చెప్పారు. హయత్నగర్, ఫలక్నుమా, హెచ్సీయూ, మియాపూర్, బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్, ఉప్పల్, జీడిమెట్ల, చెంగిచర్ల, మిధాని, మెహిదీపట్నం డిపోల నుంచి కూడా వేకువజామునే బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటున్నాయి. గతంలో మాదిరే అన్ని బస్సు సర్వీసులను వేకువ జాము నుంచి అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా.. రాత్రి కూడా 10 గంటల వరకూ వాటికి షెడ్యూల్ వేశామన్నారు. విద్యాసంస్థలు పూర్తి స్థాయిలో పని చేస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు అనువుగా ఉండేందుకు టీఎస్ఆర్టీసీ సిటీ బస్సులను పెంచింది. హయత్నగర్-కోఠి మధ్య రోజూ తిరిగే బస్సులకు అదనంగా మరో 12 సర్వీసుల(రూటు నంబరు 299)ను అందుబాటులోకి తీసుకు వచ్చామని హైదరాబాద్ రీజియన్ మేనేజర్ వెంకన్న చెప్పారు. బుధవారం నుంచి అదనంగా బస్సులను నడుపుతున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్గా పీహెచ్డీ రామక్రిష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.