Tirupati: బర్డ్స్‌లో చిన్నపిల్లల గుండె జబ్బుల చికిత్సా విభాగం ప్రారంభించిన సీఎం

ఏపీ సీఎం జగన్‌ చిత్తూరు జిల్లా తిరుపతి నగరానికి చేరుకున్నారు. విజయవాడ నుంచి మధ్యాహ్నం బయల్దేరిన ముఖ్యమంత్రి.. తిరుపతికి చేరుకొని పలు అభివృద్ధి కార్యక్రమాల

Updated : 11 Oct 2021 17:27 IST

తిరుపతి: ఏపీ సీఎం జగన్‌ చిత్తూరు జిల్లా తిరుపతి నగరానికి చేరుకున్నారు. విజయవాడ నుంచి మధ్యాహ్నం బయల్దేరిన ముఖ్యమంత్రి.. తిరుపతికి చేరుకొని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. నగరంలోని బర్డ్‌ ఆస్పత్రిలో పిల్లల గుండె జబ్బుల  చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం అలిపిరి శ్రీవారి పాదాల వద్ద గోమందిరంతో పాటు ఆధునీకీకరించిన అలిపిరి కాలినడక మార్గాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. సీఎం రెండు రోజుల పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని