AP News: దుర్గ గుడి ఆదాయానికి టోకరా.. చీరల స్కాంలో రూ.11.78 లక్షలు పక్కదారి
‘విజయవాడ దుర్గగుడిలో రెండేళ్ల కిందట చీరల స్కాం జరిగింది. చీరల కౌంటర్లో ఉండే సిబ్బంది చేతివాటం చూపించారు. గత ఈవో సురేష్బాబు
డబ్బులు ఎగ్గొట్టిన మరికొందరు గుత్తేదారులు
ఈనాడు, అమరావతి
‘విజయవాడ దుర్గగుడిలో రెండేళ్ల కిందట చీరల స్కాం జరిగింది. చీరల కౌంటర్లో ఉండే సిబ్బంది చేతివాటం చూపించారు. గత ఈవో సురేష్బాబు నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీతో అంతర్గత విచారణ కూడా చేపట్టారు. అప్పటి దేవాదాయశాఖ కమిషనర్ అనూరాధ, ఈవో సురేష్బాబు స్వయంగా పలుసార్లు చీరల కేంద్రాన్ని పరిశీలించి.. విచారణ చేపట్టారు. చివరికి రూ.11.78లక్షలు పక్కదారిపట్టినట్టు లెక్కలు తేల్చారు. పక్కదారి పట్టిన డబ్బులను దేవస్థానానికి కట్టిస్తామని, బాధ్యులపై చర్యలు చేపడతామని ప్రకటించారు. కానీ.. కనీసం పోలీసు కేసు కూడా పెట్టలేదు. ఆ తర్వాత ఈ విషయాన్ని పట్టించుకోకుండా వదిలేశారు. దేవస్థానానికి రావాల్సిన డబ్బుల్లో ఎంత వసూలు చేశారో.. ఎంత వదిలేశారో కూడా ఎవరికీ తెలియదు.’ దుర్గగుడికి వచ్చే ఆదాయం ఏళ్ల తరబడి పక్కదారి పడుతూనే ఉంది. అక్రమాలను గుర్తించినా.. అమ్మవారి సొమ్మును వెనక్కి రప్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు.
రూ.76 లక్షలని తొలుత తేల్చి..
దుర్గగుడిలో జరిగిన చీరల స్కాంలో భారీగా అక్రమాలకు పాల్పడినట్టు ఆరంభంలో గుర్తించారు. వాస్తవంగా అయితే.. రూ.76 లక్షల వరకు పక్కదారి పట్టినట్టు తొలుత అధికారులే ప్రకటించారు. కానీ.. నెలల తరబడి విచారణ చేసిన తర్వాత చివరికి రూ.11.78లక్షలని తేల్చారు. విచారణలో అనేక అక్రమాలు బయటపడ్డాయి. తక్కువ రకం చీరలకు అధిక ధరల స్టిక్కర్లు అంటించారు. ఖరీదైన చీరలను మాత్రం పక్కదారి పట్టించి.. బయట మార్కెట్లో అమ్ముకున్నారు. చాలామంది భక్తులు అమ్మవారి కోసం ఖరీదైన చీరలను ఇస్తారు. అలాంటి వాటిని మాయం చేసి.. తక్కువ రకానివి ఆ స్థానంలో ఉంచారు. స్టిక్కర్లు మాత్రం అధిక ధరలవి అంటించేశారు. ఇలా ఏకంగా 2500కు పైగా ఖరీదైన చీరలను మార్చేసినట్టు అధికారులు గుర్తించారు. 2018 నుంచి ఈ అక్రమ తంతు చేస్తూ.. భక్తులకు వాటిని అధిక ధరలకు విక్రయించాలని చూశారు. కానీ.. అంత ధరలు ఆ చీరలకు ఉండవని తెలిసిన భక్తులెవరూ వాటిని కొనుగోలు చేయలేదు. దీంతో అవన్నీ గోదాములో ఉండిపోవడంతో.. స్కాం బయటపడింది. దీనికితోడు చీర ముక్కలతో సంచులు కుట్టిస్తామని, పని చేసే కుర్రాళ్లకు జీతాలు ఇవ్వాలని చెప్పి దేవస్థానం డబ్బులను మరికొంత డ్రా చేసుకుని.. సొంత జేబుల్లో వేసుకున్నారు.
గతంలోనూ చాలా ఘటనలు..
గతంలో దుర్గగుడి టోల్ గేట్కు సంబంధించిన కాంట్రాక్టును తీసుకున్న ఓ గుత్తేదారు.. ఆలయానికి ఏకంగా రూ.25 లక్షల వరకు ఎగ్గొట్టి వెళ్లిపోయాడు. వాస్తవానికి కాంట్రాక్టు ఇచ్చేటప్పుడే సవాలక్ష నిబంధనలు పెడతారు. దాని ప్రకారం.. గుత్తేదారు నుంచి ముందుగానే ఆలయానికి రావాల్సిన డబ్బులను వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ.. అతనికి ఇచ్చిన కాంట్రాక్టు గడువు పూర్తయ్యే వరకు డబ్బులు చెల్లించకపోయినా.. చూస్తూ ఊరుకున్నారు. టోల్గేట్ ద్వారా వచ్చే డబ్బులన్నీ తీసుకుని.. చివరికి సమయం తీరిపోయాక.. తనకు నష్టం వచ్చిందంటూ చెప్పి డబ్బులు ఎగ్గొట్టాడు. వాస్తవంగా ఇలాంటి వారిపై కేసు పెట్టి.. ఆలయానికి రావాల్సిన డబ్బులను వసూలు చేయాల్సి ఉంటుంది. ఆలయానికి సంబంధించిన దుకాణాలు, సరకులు, క్లోక్రూం, సెల్ఫోన్ కౌంటర్లు, టోల్గేట్, కొబ్బరి చిప్పలు, ఫొటోలు.. ఇలా ఏ టెండర్ విషయంలోనూ గుత్తేదారులకు నష్టం అనేది ఎట్టిపరిస్థితుల్లోనూ రాదు. నష్టం వస్తే.. పోటీ పడి మరీ టెండర్లను దక్కించుకోరు. కావాలనే ఇక్కడి పనిచేసే కొంతమంది సిబ్బంది ఇచ్చే సలహాలతో ఇలా.. టోకరా వేసి వెళ్లిపోతూ ఉంటారు. ఇలాగే గతంలో ఆలయ క్లోక్రూం, సెల్ఫోన్ కౌంటర్లు, కొబ్బరికాయలు, ఫొటోలు తీసే కాంట్రాక్టులు దక్కించుకున్న గుత్తేదారులు సైతం తాము పాడుకున్న మొత్తాలను చెల్లించకుండా ఎగ్గొట్టి వెళ్లిపోయారు. ఆలయానికి సంబంధించిన పొలాలను లీజులకు తీసుకున్న కొంతమంది కూడా డబ్బులు చెల్లించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?