Hyderabad News: ప్రతి ఆదివారం ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు

వారాంతంలో ట్యాంక్‌బండ్‌ అందాలను వీక్షించి ఆస్వాదించేందుకు ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఒక నెటిజన్‌ పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావుకు విజ్ఞప్తి

Updated : 25 Aug 2021 07:18 IST

సాయంత్రం 5 నుంచి రాత్రి 8 వరకు

నెటిజన్‌ వినతిపై కేటీఆర్‌ స్పందన

ఈనాడు, హైదరాబాద్‌: వారాంతంలో ట్యాంక్‌బండ్‌ అందాలను వీక్షించి ఆస్వాదించేందుకు ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఒక నెటిజన్‌ పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావుకు విజ్ఞప్తి చేయగా... దానిపై ఆయన వెంటనే స్పందించారు. ప్రతి ఆదివారం సాయంత్రం అయిదు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ను దారి మళ్లించాలని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ను ఆదేశించారు. దీనికి అనుగుణంగా వచ్చే ఆదివారం సాయంత్రం అయిదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలను అమలు చేయనున్నారు. మరింత ఎక్కువ మంది నగరవాసులు ఆ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని