Amaravati JAC: మాతో చర్చించే అర్హత మంత్రి బొత్సకు లేదు: అమరావతి ఐకాస నేతలు

తన మంత్రి పదవిని కాపాడుకునేందుకే బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతిపై అసత్య ప్రచారం చేస్తున్నారని అమరావతి ఐకాస నేతలు మండిపడ్డారు.

Published : 29 Aug 2021 15:43 IST

అమరావతి: తన మంత్రి పదవిని కాపాడుకునేందుకే బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతిపై అసత్య ప్రచారం చేస్తున్నారని అమరావతి ఐకాస నేతలు మండిపడ్డారు. రాజధాని అంశంపై తాము స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే చర్చిస్తామని.. బొత్సకు తమతో చర్చించే అర్హత లేదని స్పష్టం చేశారు. మంత్రి పదవిని కాపాడుకునేందుకు ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని తేల్చి చెప్పారు. రాబోయే రెండు, మూడు నెలల్లో బొత్స జీరోగా మరడం ఖాయమని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ ఇప్పటికైనా మేలుకోవాలని.. లేకపోతే ఇలాంటి అవగాహన లేని మంత్రుల కారణంగా నిండా మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాజధాని సమస్యను  పరిష్కరించేందుకు సీఎం ప్రయత్నించాలని కోరారు. రాజధానిపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే అమరావతిలో తిరగనివ్వబోమని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారా ఏదైనా పరిష్కారమవుతుందని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని