Amaravati Padayatra: 14వ రోజుకు చేరిన అమరావతి ‘మహాపాదయాత్ర’

అమరావతి రైతుల ‘మహాపాదయాత్ర’ 14వ రోజు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం యరజర్ల శివారు నుంచి ప్రారంభమైంది.

Updated : 14 Nov 2021 10:59 IST

అమరావతి: అమరావతి రైతుల ‘మహాపాదయాత్ర’ 14వ రోజు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం యరజర్ల శివారు నుంచి ప్రారంభమైంది. ఇవాళ 13 కిలోమీటర్ల మేర సాగనున్న పాదయాత్ర ఎం.నిడమానూరు వద్ద ముగియనుంది. మర్లపాడులో మధ్యాహ్న భోజన విరామం తీసుకోనున్న రైతులు.. ఇవాళంతా కొండపి నియోజకవర్గ పరిధిలో నడవనున్నారు. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని చేపట్టిన యాత్రకు స్థానికులు, రైతుల నుంచి సంఘీభావం లభిస్తోంది.

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మహిళలు, రైతులకు మద్దతుగా ఇతర ప్రాంతాల నుంచి సైతం ప్రజలు వచ్చి పాదయాత్రలో పాల్గొంటున్నారు. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యాత్ర 45 రోజుల పాటు కొనసాగి డిసెంబర్‌ 15న తిరుమలలో ముగియనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని