Amaravati Padayatra: ఉత్సాహంగా సాగుతోన్న అమరావతి ‘మహాపాదయాత్ర’

అమరావతి రైతుల మహా పాదయాత్ర 20వ రోజు ఉత్సాహంగా కొనసాగుతోంది.

Updated : 27 Feb 2024 19:03 IST

గుడ్లూరు: అమరావతి రైతుల మహా పాదయాత్ర 20వ రోజు ఉత్సాహంగా కొనసాగుతోంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన యాత్ర ప్రకాశం జిల్లా గుడ్లూరు నుంచి ఇవాళ ప్రారంభమైంది. 18కి.మీ.మేర కొనసాగే యాత్ర సాయంత్రం ఆరు గంటలకు కావలి మండలం రాజువారిచింతలపాలెంలో ముగియనుంది. ఈ రాత్రి రైతులు అక్కడే బస చేయనున్నారు. అమరావతి రైతులకు స్థానికులు మద్దతు తెలుపుతున్నారు. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్ర 45 రోజుల పాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా తిరుమలకు చేరనుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని