Amaravati Padayatra: అపూర్వ మద్దతుతో ‘మహాపాదయాత్ర’ ముందుకు..

ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న ‘మహాపాదయాత్ర’ 23వ రోజు కొనసాగుతోంది.

Updated : 23 Nov 2021 18:59 IST

అమరావతి: ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న ‘మహాపాదయాత్ర’ 23వ రోజు కొనసాగుతోంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన యాత్ర ఇవాళ నెల్లూరు జిల్లా కొండ బింట్రగుంట నుంచి ప్రారంభమైంది. 15 కిలో మీటర్ల మేర సాగే ఇవాళ్టి యాత్ర సాయంత్రానికి సున్నంబట్టికి చేరుకుంటుంది.. స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు, రైతులు, రాజకీయ నాయకుల నుంచి పాదయాత్రకు అపూర్వ మద్దతు లభిస్తోంది. పెద్ద సంఖ్యలో తరలివచ్చి రాజధాని రైతులకు సంఘీభావం తెలుపుతున్నారు.

మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు చట్టాలను ప్రభుత్వం నిన్న వెనక్కి తీసుకున్నప్పటికీ పాదయాత్రను కొనసాగిస్తామని అమరావతి ఐకాస ప్రకటించిన విషయం తెలిసిందే. అమరావతే ఏపీకి ఏకైక రాజధాని అని ప్రభుత్వం ప్రకటించాలని ఐకాస డిమాండ్‌ చేసింది. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్ర 45 రోజుల పాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా తిరుమలకు చేరనుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని