Amaravati Padayatra: ఏడో రోజుకు ‘మహాపాదయాత్ర’.. భారీగా పోలీసుల మోహరింపు
అమరావతినే ఏపీ ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన
పర్చూరు: అమరావతినే ఏపీ ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన అమరావతి ‘మహాపాదయాత్ర’ ఏడో రోజు ప్రారంభమైంది. ఇవాళ పర్చూరు నుంచి ఇంకొల్లు వరకు సుమారు 17 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా చేస్తున్న ఈ పోరాటానికి వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. కార్తిక సోమవారం సందర్భంగా రేపు పాదయాత్రకు విరామం ప్రకటించారు. యథావిధిగా మంగళవారం నుంచి మళ్లీ సాగనుంది. 45 రోజుల పాటు సాగనున్న యాత్ర తిరుమలలో ముగియనుంది.
మరో వైపు ఇవాళ్టి పాదయాత్రలో పోలీసులు భారీగా మోహరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ పాదయాత్ర నిర్వాహకులను పోలీసులు మరోసారి హెచ్చరించారు. ఈ క్రమంలో పర్చూరులో రైతుల శిబిరం వద్దకు డీఎస్పీ శ్రీకాంత్ వెళ్లారు. హైకోర్టు ఆదేశాల మేరకే యాత్ర సాగుతోందని ఐకాస నాయకులు ఆయనకు తెలిపారు. ఎవరైనా వచ్చి సంఘీభావం తెలిపితే తమకు సంబంధం లేదని నిర్వాహకులు వివరించారు. కొవిడ్, ఇతర నిబంధనలు పాటించలేదంటూ పాదయాత్రికులకు ప్రకాశం జిల్లా పోలీసులు నిన్న నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు