Amaravati: ప్రాంతాల వారీగా చిచ్చుపెట్టాలనే అమరావతిపై బొత్స దుష్ప్రచారం: శివారెడ్డి
ప్రాంతాల వారీగా ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని మంత్రి బొత్స సత్యనారాయణ
అమరావతి: ప్రాంతాల వారీగా ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి ఆరోపించారు. సీఎం జగన్ మెప్పు కోసం మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.‘‘ రాష్ట్రాన్ని ఎడారి పాల్జేయాలని చూస్తే ఊరుకునేది లేదు. రాజధాని లేని రాష్ట్రం కోసం రైతులు భూములను త్యాగం చేశారు. విశాఖ స్టీల్ప్లాంట్ కార్మికులకు న్యాయం చేయలేకపోతున్నారు. ప్రజల భావోద్వేగాలను ఎందుకు రెచ్చగొడుతున్నారు. ఎన్ని అరాచకాలు జరుగుతాయోనని ఉత్తరాంధ్ర ప్రజలు భయపడుతున్నారు. ఈ రోజు పరిపాలన జరుగుతోంది తాము ఇచ్చిన భూముల నుంచే అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మంత్రులు వ్యాఖ్యలు చేయడం భావ్యంగా లేదు’’ అని శివారెడ్డి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా