Amaravati News: మందడంలో రైతులు, పోలీసుల మధ్య తోపులాట
రాజధాని అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో పోలీసుల నిర్బంధ చర్యలు కొనసాగుతున్నాయి.
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో పోలీసుల నిర్బంధ చర్యలు కొనసాగుతున్నాయి. అమరావతి ఐక్యకార్యాచరణ సమితి పిలుపు మేరకు హైకోర్టు వద్దకు వెళ్లేందుకు సిద్ధమైన రాజధాని ప్రాంత రైతులు, మహిళలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో మందడం, వెంకటపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. వెంకటపాలెంలో రైతుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో గ్రామస్థులు నిరసన తెలిపారు. గ్రామంలోని రోడ్లను దిగ్బంధించారు.
మరోవైపు మందడంలో రైతులు, మహిళలను అడ్డుకోవడంతో పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు- రైతులు, మహిళల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. తోపులాటలో రైతు రాజేంద్ర కాలు విరిగింది. అనంతరం పలువురు ఆందోళకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీని అడ్డుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై మహిళలు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ అనంతవరంలో రోడ్డుపై మహిళలు, రైతులు భైఠాయించారు. భద్రతా బలగాల నుంచి తప్పించుకుని హైకోర్టు వద్దకు చేరుకున్న 15 మంది మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని పెదకూరపాడు పీఎస్కు తరలించారు.
దేవినేని ఉమ, కొనకళ్ల నారాయణ గృహనిర్బంధం
అమరావతి ఆందోళనలో పాల్గొంటారనే సమాచారంతో తెదేపా సీనియర్ నేతలు దేవినేని ఉమ, కొనకళ్ల నారాయణను పోలీసులు గృహనిర్బంధం చేశారు. బయటకు వెళ్లకుండా వారిని ఇంట్లోనే నిర్బంధించారు. మరోవైపు మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్దకు చేరుకున్న ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరిన్ని ఫొటోల కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్