AP News: ఏయూలో అమెరికన్‌ కార్నర్‌.. ప్రారంభించిన సీఎం జగన్‌

విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో అమెరికన్‌ కార్నర్‌ ఏర్పాటైంది. సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి

Updated : 23 Dec 2022 16:39 IST

అమరావతి: విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో అమెరికన్‌ కార్నర్‌ ఏర్పాటైంది. సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా అమెరికన్‌ కార్నర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమెరికన్‌ కాన్సులేట్ జనరల్‌, మిషన్‌ డైరెక్టర్‌ వీణారెడ్డి, యునివర్సిటీ వీసీ ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడారు. దేశంలో అహ్మదాబాద్‌, హైదరాబాద్‌ తర్వాత విశాఖపట్నంలోనే అమెరికన్‌ కార్నర్‌ ఏర్పాటు చేయడం సంతోషకరమని జగన్‌ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఇదెంతో మేలు చేస్తుందని తెలిపారు. కాగా, యూఎస్‌ విద్య, ఉద్యోగాంశాల్లో సమాచారం కోసం అమెరికా కార్నర్‌ సాయపడనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని