Omicron: విశాఖలో ఒమిక్రాన్‌ కేసు..

ఏపీలో మరో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన విశాఖ, తూర్పుగోదావరి జిల్లా వాసులకు

Updated : 24 Dec 2021 14:59 IST

అమరావతి: ఏపీలో మరో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన విశాఖ, తూర్పుగోదావరి జిల్లా వాసులకు ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరానికి చెందిన 41 ఏళ్ల మహిళతో పాటు విశాఖకు చెందిన 33 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు రాష్ట్ర ప్రజారోగ్యశాఖ కార్యాలయం వెల్లడించింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళ ఈనెల 19న కువైట్‌ నుంచి.. విశాఖకు చెందిన వ్యక్తి ఈనెల 15న యూఏఈ నుంచి వచ్చినట్లు తెలిపింది. ప్రస్తుతం ఇరువురూ క్వారంటైన్‌ ఉన్నారని.. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు విదేశాల నుంచి రాష్ట్రానికి 53 మంది వచ్చారని.. వారిలో 9 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిందన్నారు. వారి నమూనాలను సీసీఎంబీ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపామన్నారు. రాష్ట్రంలో తాజాగా నమోదైన రెండింటితో కలిపి ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య నాలుగుకి చేరింది.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని