Ap News: చర్చల్లా కాకుండా చిట్‌చాట్‌లా భేటీ జరుగుతోంది: ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ చర్చలు కొనసాగుతున్నాయి. అయితే చర్చలు జరుగుతున్న తీరుపై ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనవంతు సమయం వచ్చాక వస్తానంటూ చర్చలు జరుగుతున్న గది నుంచి బయటకొచ్చారు. చర్చలో...

Updated : 15 Dec 2021 15:59 IST

అమరావతి: ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ చర్చలు కొనసాగుతున్నాయి. అయితే చర్చలు జరుగుతున్న తీరుపై ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనవంతు సమయం వచ్చాక వస్తానంటూ చర్చలు జరుగుతున్న గది నుంచి బయటకొచ్చారు. చర్చల్లో పనికిరాని వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఐకాస నేతలు బండి శ్రీనివాస్, బొప్పరాజు వెంకటేశ్వర్లుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చల్లా కాకుండా చిట్‌చాట్‌లా భేటీ జరుగుతోందని సూర్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి పేషీ వద్దే ఉద్యోగుల సంఘం ప్రతినిధులు నిరీక్షిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని