AP News: ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు మరోసారి అస్వస్థత.. హైదరాబాద్‌కు తరలింపు

ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈనెల 15న గవర్నర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది....

Published : 29 Nov 2021 01:19 IST

అమరావతి: ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఈనెల 15న గవర్నర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన 17న హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఈనెల 20, 22 తేదీల్లో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా కొవిడ్‌ నెగెటివ్‌గా నిర్ధారణ కావడంతో 23న ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు. ఇవాళ సాయంత్రం మరోసారి అస్వస్థతకు గురవడంతో విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ చేరుకుని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని