Ap News: ఉద్యోగుల బదిలీలపై ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

ఉద్యోగుల బదిలీలపై పాక్షికంగా ఉన్న నిషేధాన్ని ఏపీ సర్కార్‌ సడలించింది. వచ్చే నెల 4 వరకు ఉద్యోగుల పరస్పర బదిలీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే పరస్పర

Published : 06 Dec 2021 21:14 IST

అమరావతి‌: ఉద్యోగుల బదిలీలపై పాక్షికంగా ఉన్న నిషేధాన్ని ఏపీ సర్కార్‌ సడలించింది. వచ్చే నెల 4 వరకు ఉద్యోగుల పరస్పర బదిలీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే పరస్పర అంగీకార బదిలీలపై మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నిషేధం సడలించింది. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు ఈ సడలింపు ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఓకే చోట రెండేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారు మాత్రమే పరస్పర బదిలీలకు అర్హులని ప్రభుత్వం పేర్కొంది. బదిలీ కోరుకొనే ఉద్యోగులపై ఏసీబీ, విజిలెన్స్‌ కేసులు, ఇతర అభియోగాలు ఉండకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని