AP News: రాజధాని ఎక్కడనే అంశంపై కాదు.. ప్రభుత్వ విధాన నిర్ణయంపైనే విచారణ: సీజే
రాజధాని ఎక్కడ ఉండాలనే అంశంపై విచారణ జరపడం లేదని.. ప్రభుత్వం తీసుకున్న విధాన పరమైన నిర్ణయాల చట్టబద్దతపైనే విచారణ జరుపుతున్నామని ..
అమరావతి: రాజధాని ఎక్కడ ఉండాలనే అంశంపై విచారణ జరపడం లేదని.. ప్రభుత్వం తీసుకున్న విధాన పరమైన నిర్ణయాల చట్టబద్దతపైనే విచారణ జరుపుతున్నామని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర అన్నారు. రాజధానికి సంబంధించిన వ్యాజ్యాలపై వరుసగా నాలుగో రోజు హైకోర్టులో విచారణ జరిగింది. సీనియర్ న్యాయవాదులు ఆదినారాయణరావు, ఉన్నం మురళీధర్లు రైతుల తరఫున వాదనలు వినిపించారు. అమరావతిలో రాజధాని ఏర్పాటు నిర్ణయంపై అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైకాపా వ్యతిరేకించలేదని న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదించారు.
ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అమరావతి నిర్ణయాన్ని స్వాగతించారు. దానికి సంబంధించిన వీడియోలు సైతం అవసరమైతే ప్రదర్శిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ 3 రాజధానుల నిర్ణయం చేశారన్నారు. భూమి, నీరు, భౌగోళికంగా రాష్ట్రం మధ్యలో ఉండటం, అన్నిటికి అనుకూలమైన ప్రాంతం కావడంతో అమరావతిని ఎంపిక చేశారని తెలిపారు. శివరామకృష్ణ కమిటీ నివేదికలో కూడా వివిధ రకాల సూచనలు చేశారన్నారు. మెజారిటీ ప్రజలు రాజధానిని అమరావతిలోనే ఏర్పాటు చేయాలని కోరారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఒకసారి ఆమోదించిన మాస్టర్ ప్లాన్ను మార్చేందుకు వీల్లేదన్నారు. గతంలో అమరావతి రాజధాని నిర్ణయాన్ని ఎవరూ కోర్టులో సవాలు చేయలేదని సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. అన్ని ప్రాంతాల అభివృధ్ధి అని చెబుతున్నవారు.. ఆరోజు ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు.
ఇప్పుడు 3 రాజధానుల నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. చరిత్రలో ఒక్కచోట మాత్రమే రాజధాని ఉందన్నారు. పునర్విభజన చట్టంలో ఒక క్యాపిటల్ అని మాత్రమే ఉందని తెలిపారు. అడ్వకేట్ జనరల్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రైతుల తరఫు న్యాయవాది ఆదినారాయణరావు వినిపించారు. సీఆర్డీఏ ఏర్పడిన తర్వాత అభివృద్ధి జరిగిందని.. అది కళ్ల ముందు కనిపిస్తుందన్నారు. ఇప్పుడు పునరాలోచన చేయడం అనేది అభివృద్ధి విఘాతమే అవుతుందని తెలిపారు. సమయం ముగియడంతో తదుపరి విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్గా పీహెచ్డీ రామక్రిష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ