AP News: పొన్నలూరు చెరువులో ఆర్టీసీ బస్సు బోల్తా 

ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. నాగిరెడ్డిపాలెం సమీపంలో చెరువు

Updated : 02 Dec 2021 16:14 IST

ప్రయాణికులు సురక్షితం

కందుకూరు పట్టణం: ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. నాగిరెడ్డిపాలెం సమీపంలో చెరువు కట్టపై ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. వివరాల్లోకి వెళితే.. కందుకూరు నుంచి కనిగిరి వైపు వెళ్తున్న బస్సు.. చెరువు కట్టపైకి రాగానే అదుపుతప్పి చెరువులోకి బోల్తా పడింది. ఆ సమయంలో అక్కడ చేపలు పట్టేవారు గమనించి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉండగా.. వారు స్వల్ప గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్టీసీ అధికారులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని