APSRTC: సంక్రాంతికి ప్రత్యేక బస్సులు.. 50శాతం అదనపు ఛార్జీలు

సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. ఈ నెల 8 నుంచి 17 వరకు ప్రత్యేక బస్సులను నడపనుంది.

Updated : 04 Jan 2022 15:46 IST

 

అమరావతి: సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. ఈ నెల 8 నుంచి 17 వరకు ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు 2,500, విశాఖకు 850, విజయవాడకు 600, బెంగళూరుకు 300, చెన్నైకు 120 బస్సులు నడపనున్నారు. జిల్లా కేంద్రాల నుంచి ప్రధాన పట్టణాలకు మరికొన్ని ప్రత్యేక బస్సులు తిరగనున్నాయి. వీటికి ఆర్టీసీ ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించింది. ప్రత్యేక బస్సుల్లో 50శాతం అదనపు ఛార్జీలను ఏపీఎస్‌ఆర్టీసీ వసూలు చేయనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని