AP News: నెల్లూరు జిల్లాలో మంత్రి గౌతమ్‌రెడ్డికి నిరసన సెగ

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి వరద బాధితుల నుంచి నిరసన సెగ తగిలింది. ..

Updated : 24 Nov 2021 14:56 IST

సంగం: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి వరద బాధితుల నుంచి నిరసన సెగ తగిలింది. నెల్లూరు జిల్లా సంగం మండలం కోలగట్లకు వెళ్లిన మంత్రిని బాధితులు గట్టిగా నిలదీశారు. చస్తామో బతుకుతామో అని బిక్కుబిక్కుమంటూ గడిపితే పరామర్శ పేరుతో ఇప్పుడు వస్తారా అని ప్రశ్నించారు. నడుముల్లోతు వరద ముంచెత్తడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డామని.. తిండికీ లేక అల్లాడిపోయామని వాపోయారు. వారిని ఓదార్చిన మంత్రి గౌతమ్‌రెడ్డి ప్రభుత్వం తరఫున వీలైన సాయం చేస్తామని చెప్పారు. కష్టనష్టాలు తెలుసుకొని మరింత అండగా నిలుస్తామని మంత్రి బాధితులకు హామీ ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని