HYD: బాలాపూర్‌ లడ్డూ వేలంపాట ప్రారంభం

గణేశ్‌ ఉత్సవాల్లో ఎంతో ప్రాముఖ్యం ఉన్న నగరంలోని బాలాపూర్‌ లడ్డూ వేలంపాట ప్రారంభమైంది.

Updated : 19 Sep 2021 10:18 IST

హైదరాబాద్‌: గణేశ్‌ ఉత్సవాల్లో ఎంతో ప్రాముఖ్యం ఉన్న నగరంలోని బాలాపూర్‌ లడ్డూ వేలంపాట ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కడప జిల్లా ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌ హాజరయ్యారు. వీరితో 2019లో బాలాపూర్‌ లడ్డూను దక్కించుకున్న కొలను రాంరెడ్డి వేలంపాటకు వచ్చారు. ఆ సమయంలో రూ.17.60 లక్షలకు రాంరెడ్డి లడ్డూరు దక్కించుకున్నారు. కొవిడ్‌ కారణంగా గతేడాది వేలంపాట జరగలేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని