Off beat: వివాహ విందులో ఆహారం మిగిలిందని.. ఆ మహిళ ఏం చేసిందో తెలుసా..?
భారత్లో పెళ్లిళ్లు అంటే భారీదనానికి పెట్టింది పేరు. పెళ్లి తంతు మొదలైన దగ్గరి నుంచి ప్రతి చిన్న కార్యక్రమంలోనూ తమ తాహతు కనిపించేలా ఏర్పాట్లు ఉంటాయి. ఇక ఆతిథ్యం విషయంలో ఏమాత్రం తగ్గేదేలే.
కోల్కతా: భారత్లో పెళ్లిళ్లు అంటే భారీతనానికి పెట్టింది పేరు. పెళ్లి తంతు మొదలైన దగ్గరి నుంచి ప్రతి చిన్న కార్యక్రమంలోనూ తమ తాహతు కనిపించేలా ఏర్పాట్లు ఉంటాయి. ఇక ఆతిథ్యం విషయంలో ఏమాత్రం తగ్గేదేలే. వేడుకకు వచ్చిన ఆత్మీయులు రుచికరమైన భోజనం చేయాలని రకరకాల వంటలు సిద్ధం చేస్తారు. ఈ క్రమంలోనే ఆహారపదార్థాలు మిగిలిపోతుంటాయి. అవన్నీ వృథా అవుతున్నా.. పెళ్లి హడావుడిలో పడి వాటిని పట్టించుకునే అవకాశం ఉండకపోవచ్చు..!
అయితే నీలాంజన్ మండల్ అనే వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ షేర్ చేసిన దృశ్యాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. పశ్చిమ్ బెంగాల్లోని రాణాఘట్ రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో తన కెమెరా కంటికి చిక్కిన దృశ్యాలు ఫేస్బుక్లో షేర్ చేశారు. పాపియా కర్ అనే మహిళ తన సోదరుడి వివాహ విందులో మిగిలిన వంటల్ని తీసుకొచ్చి, రైల్వే స్టేషన్ వద్ద అభాగ్యులకు పంచుతూ కనిపించారు. తను ముస్తాబైన దుస్తుల్లోనే అక్కడికి వచ్చి, రైల్వే స్టేషన్ ప్లాట్ఫాంపై కూర్చొని ఆకలితో అలమటిస్తున్నవారికి స్వయంగా వడ్డించారు. ఆమె పెట్టే అన్నం కోసం పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు చాలామంది ఆమె చుట్టూ గుమిగూడారు. ఇలా అన్నార్తులకు కడుపు నిండా తిండి పెట్టడం ఆమెకు కొత్తేం కాదని స్థానికులు వెల్లడించారు. కాగా, ఆమె చూపిన చొరవపై నెట్టింట్లో ప్రశంసలు దక్కుతున్నాయి. ఇలాంటి చర్యలు ఇతరులకు ప్రేరణగా నిలుస్తాయని పలువురు అభినందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. -
ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
-
రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్