Ts News: విజయసాయిరెడ్డివిచారణకెందుకు రాలేదు?: సీబీఐ కోర్టు
జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి విచారణకు ఎందుకు హాజరు కాలేదని సీబీఐ కోర్టు ప్రశ్నించింది. దిల్లీలో ఉన్నందున ఇవాళ్టి విచారణకు హాజరుకాలేక పోయారని
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి విచారణకు ఎందుకు హాజరు కాలేదని సీబీఐ కోర్టు ప్రశ్నించింది. దిల్లీలో ఉన్నందున ఇవాళ్టి విచారణకు హాజరుకాలేక పోయారని విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పార్లమెంటు సమావేశాలు ముగిశాయి కదా అని న్యాయస్థానం అడగ్గా.. సాయంత్రం వరకు జరిగినందున ఇవాళ రాలేకపోయారని న్యాయవాది వివరించారు. దీంతో విజయసాయిరెడ్డికి నేటి విచారణకు హాజరు మినహాయింపునిచ్చింది. జగతి పబ్లికేషన్స్ ఈడీ కేసులో డిశ్చార్జ్ పిటిషన్ పై ఇవాళ విజయసాయిరెడ్డి వాదనలు జరిగాయి. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులపై హైకోర్టులో స్టేటస్ కో ఉన్నందున.. ప్రస్తుత దశలో విచారణ జరపడం తగదని విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. సీబీఐ కేసు కూడా ఇంకా రుజువు కాలేదన్నారు. విజయసాయిరెడ్డి డిశ్చార్జ్ పిటిషన్పై విచారణ ఈనెల 30కి వాయిదా పడింది. ఇందూ టెక్ జోన్ లో డిశ్చార్జ్ పిటిషన్పై జగన్ వాదనలు జరిగాయి. ఇందూ టెక్ జోన్కు భూమి కేటాయింపు ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయమని జగన్ తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వాదించారు. జగన్ డిశ్చార్జ్ పిటిషన్పై వాదనలు ఈనెల 31కి వాయిదా పడ్డాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు