Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు

నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు.

Updated : 01 Jan 2022 17:16 IST

తిరుమల: నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క, తమిళనాడు మంత్రి గాంధీ, గుజరాత్‌ మంత్రి జితేంద్ర చౌదరి, సినీ నటుడు సాయికుమార్‌, నటి కంగనా రనౌత్, దర్శకుడు అనిల్‌ రావిపూడి స్వామివారి సేవలో పాల్గొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆలయానికి వచ్చిన ప్రముఖులకు రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు నేతలు, ప్రముఖులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని