ఏపీ ఫైబర్‌ నెట్‌లో అవకతవకల ఆరోపణలు.. ఇద్దరికి సీఐడీ నోటీసులు

గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్‌ నెట్‌ సంస్థలో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో

Updated : 14 Sep 2021 18:36 IST

అమరావతి: గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్‌ నెట్‌ సంస్థలో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏపీ సీఐడీ పలువురికి నోటీసులు జారీచేసింది. తెదేపా ప్రభుత్వ హయాంలో ఇన్ఫాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించిన సాంబశివరావు, టెక్నికల్‌ కమిటీ సభ్యుడిగా పనిచేసిన హరిప్రసాద్‌కు నోటీసులు పంపింది. నోటీసులు అందినందున విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో వాళ్లిద్దరూ విచారణకు హాజరయ్యారు. తమపై వచ్చిన ఆరోపణలపై సీఐడీకి వివరణ ఇచ్చి విచారణకు సహకరిస్తామని హరిప్రసాద్‌ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని