TS News: రామప్ప క్షేత్రాన్ని సందర్శించి మురిసిపోయా: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
కాళోజీ స్ఫూర్తితో తెలుగులో మాట్లాడుతున్నానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
హనుమకొండ: వరంగల్తో తనకు అవినాభావ సంబంధం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. హనుమకొండలో పది కోర్టుల భవన సముదాయం ప్రారంభించిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాళోజీ స్ఫూర్తితో తెలుగులో మాట్లాడుతున్నానని చెప్పారు.
గొప్ప వారసత్వ సంపదను యునెస్కో గుర్తించింది
‘‘కవులు, స్వాతంత్ర్య పోరాట యోధులు, విప్లవకారులు తిరిగిన నేల ఓరుగల్లు. వరంగల్తో నాకు అవినాభావ సంబంధం ఉంది. గతంలో ఇక్కడ ఆర్ఈసీలో కార్యక్రమాలకు హాజరయ్యా. ఇక్కడ నాకు బంధువులు, మిత్రులు ఉన్నారు. దేశానికి ప్రధానిని ప్రసాదించిన ప్రాంతం ఓరుగల్లు. నియంతృత్వ, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటాలకు ఇది పుట్టినిల్లు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు దాశరథి. ఆయన గర్జన పరపీడన విముక్తికి, పోరాటాలకు ఊపిరినిచ్చింది. పోరుగల్లుకు.. ఓరుగల్లుకు.. వరంగల్లుకు వందనం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దివ్యక్షేత్రాన్ని సందర్శించి ఆనందించి మురిసిపోయా. మనకున్న గొప్ప చారిత్రక సంపదను యునెస్కో గుర్తించింది. ఇది అందరూ గర్వించాల్సిన విషయం. వేయి స్తంభాల ఆలయం శిలా, కళా వైభవానికి ఖ్యాతి. ఈ ఆలయం చూసేందుకు రెండు కళ్లూ చాలవు’’ అని సీజేఐ అన్నారు.
కోర్టుల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక సంస్థ ఏర్పాటుకు ప్రతిపాదన పంపాం
కాకతీయుల చారిత్రక సంపదకు దీటుగా ఇక్కడి కోర్టు భవనాల నిర్మాణం ఉందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. కోర్టుల ఆధునీకరణతో ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందని చెప్పారు. ‘‘కోర్టుల్లో సౌకర్యాల కోసం అన్ని రాష్ట్రాల హైకోర్టుల నుంచి సమాచారం తెప్పించాం. కోర్టుల పునర్నిర్మాణానికి జస్టిస్ నవీన్రావు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. శిథిలావస్థలోని కోర్టులను పునర్నిర్మించాలని సీజేఐ అయ్యాక అనుకున్నాను. ఆధునీకరణ ద్వారానే సత్వర న్యాయం అందించగలుగుతామని చెప్పాను. కోర్టుల్లో మౌలిక సౌకర్యాల ప్రత్యేక సంస్థ ఏర్పాటుపై జులైలో కేంద్రానికి ప్రతిపాదన పంపాం. ఇండియన్ జ్యుడీషియరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రతిపాదన పంపాం’’ అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే