Ap News: ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో పాజిటివ్ వస్తేనే క్వారంటైన్కి పంపిస్తాం: ఆళ్ల నాని
విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారికి ఆర్టీ-పీసీఆర్ పరీక్ష తప్పనిసరి అని.. ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో పాజిటివ్ వస్తేనే క్వారంటైన్కు పంపిస్తామని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కొవిడ్పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి...
అమరావతి: విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారికి ఆర్టీ-పీసీఆర్ పరీక్ష తప్పనిసరి అని.. ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో పాజిటివ్ వస్తేనే క్వారంటైన్కు పంపిస్తామని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కొవిడ్పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వివరాలను మీడియాకు వెల్లడించారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్తో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయని.. అది రాష్ట్రానికి రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించినట్లు చెప్పారు. కొవిడ్ వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారన్నారు. వచ్చే ఏడాది జనవరి 15నాటికి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవ్వాలని సీఎం ఆదేశించినట్లు వెల్లడించారు.
‘‘కొవిడ్ను ఎదుర్కొనేందుకు 104 సహా అవసరమైన చర్యల సన్నద్ధతపై చర్చించాం. ఒమిక్రాన్ను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్నింటినీ సిద్ధం చేసుకోవాలి. ప్రజల్లో అవగాహన పెంచేలా చర్యలు తీసుకోవాలి. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. మాస్కులు ధరించడంలో నిర్లక్ష్యం వద్దు. మాస్కులు ధరించని వారిపై చర్యలు తీసుకుంటాం. దక్షిణాఫ్రికా నుంచి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వస్తోందని కేంద్రం ఇప్పటికే హెచ్చరించింది. కేంద్రం ముందస్తు హెచ్చరికలు సహా మార్గదర్శకాలను జారీ చేసింది. కేంద్రం ఆదేశాలు, సూచనలు తప్పనిసరిగా అమలు చేస్తాం. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదు. కొత్త వేరియంట్పై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని సీఎం జగన్ చెప్పినట్లు ఆళ్ల నాని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!