Gandhi Jayanthi: మహాత్మునికి జగన్‌, చంద్రబాబు నివాళులు

గాంధీ జయంతి సందర్భంగా మహాత్మునికి సీఎం జగన్‌ నివాళులర్పించారు. గ్రామ, వార్డు

Updated : 02 Oct 2021 14:55 IST

అమరావతి: గాంధీ జయంతి సందర్భంగా మహాత్మునికి సీఎం జగన్‌ నివాళులర్పించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రెండేళ్ల క్రితమే గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారానికి రాష్ట్రంలో అడుగులు పడ్డాయని ఆయన పేర్కొన్నారు. నేటి నుంచి క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌కు శ్రీకారం చుడుతున్నట్లు సీఎం ట్వీట్‌ చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు కూడా జాతిపితకు నివాళులు అర్పించారు. సంపూర్ణ సమైఖ్య జాతి నిర్మాణం, రాజకీయాల్లో నైతికతను గాంధీ ఆశించారని ఆయన పేర్కొన్నారు. నిజాయతీతో కూడిన రాజకీయాలు రావాలంటే ప్రజలు చైతన్యవంతులవ్వాలని ఆయన ఆకాంక్షించారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని