CM Jagan: వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారికి 5సెంట్ల స్థలంలో ఇల్లు: జగన్
భారీ వర్షాలు, వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి అయిదు సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించి ఇస్తామని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. కడప జిల్లా రాజంపేట మండలం పులపుత్తూరులో
కడప: భారీ వర్షాలు, వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి అయిదు సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించి ఇస్తామని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. కడప జిల్లా రాజంపేట మండలం పులపుత్తూరులో వరద బాధితులను సీఎం పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పులపుత్తూరులో 293 ఇళ్లు దెబ్బతిన్నాయని, వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పంటలు నష్టపోయిన రైతులందరికీ పరిహారం ఇస్తామని ప్రకటించారు. పొలాల్లో ఇసుక మేటలు తొలగించడానికి హెక్టారుకు రూ.12వేలు ఇస్తామని తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా అందరికీ ఉపాధి కల్పిస్తామన్నారు. వరదల కారణంగా డ్వాక్రా డబ్బులు చెల్లించలేమని మహిళలు ఆవేదన వ్యక్తం చేయగా.. ఏడాది పాటు మారటోరియం విధిస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. వాహనాలు కోల్పోయిన వారికి కూడా సాయం చేస్తామని సీఎం ప్రకటించారు. యువత కోసం జాబ్ మేళా ఏర్పాటు చేసి ప్రైవేటు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. పది రోజుల్లో అన్ని సహాయ కార్యక్రమాలు చేస్తామని పేర్కొన్నారు. ఎగువ మందపల్లిలో వరద బాధితులను సీఎం పరామర్శించారు. తొమ్మిది మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన పూజారి రామమూర్తిని సీఎం ఓదార్చి భరోసా ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత