Dalit bandhu: తెలంగాణ సాధించినట్లే.. దళితుల సమగ్రాభివృద్ధి సాధిస్తా: కేసీఆర్
దళితబంధు పథకంపై ఎప్పటినుంచో ప్రణాళిక ఉందని.. ప్రణాళిక కార్యాచరణకు ఇప్పుడు సమయం వచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. గతేడాది మే నెలలో ప్రారంభం కావాల్సిన
కరీంనగర్: దళితబంధు పథకంపై ఎప్పటినుంచో ప్రణాళిక ఉందని.. ప్రణాళిక కార్యాచరణకు ఇప్పుడు సమయం వచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. గతేడాది మే నెలలో ప్రారంభం కావాల్సిన దళితబంధు పథకం కరోనా వల్ల అమలు ఆలస్యం అయిందన్నారు. దళిత బంధు అమలుపై కరీంనగర్ కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా దళితచైతన్య జ్యోతి నిర్వహించానని.. ఎస్సీల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసినట్లు కేసీఆర్ తెలిపారు. ఎస్సీల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి సమాజం కదిలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాధించినట్లే.. దళితుల సమగ్ర అభివృద్ధి సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తన చివరి రక్తపుబొట్టు వరకు దళితుల కోసమే పోరాడతానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం