NGT: విశాఖ మన్యంలో అక్రమ మైనింగ్‌పై కమిటీ.. ఎన్జీటీ ఉత్తర్వులు

విశాఖ మన్యంలో అక్రమ మైనింగ్‌పై విచారణ కమిటీ ఏర్పాటైంది. కమిటీని ఏర్పాటు చేస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. కొండ్లు మరీదయ్య దాఖలు..

Updated : 30 Jul 2021 16:39 IST

దిల్లీ: విశాఖ మన్యంలో అక్రమ మైనింగ్‌పై విచారణ కమిటీ ఏర్పాటైంది. కమిటీని ఏర్పాటు చేస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. కొండ్లు మరీదయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఎన్జీటీ చెన్నై ధర్మాసనం కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మైనింగ్‌ పేరుతో అక్రమాలు జరిగాయని ఎన్జీటీ నిర్ధరణకు వచ్చింది. వేల చెట్లు కూల్చి రోడ్డు వేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. అనుమతించిన పరిధి దాటి తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో అక్రమ మైనింగ్‌ చేశారని గుర్తించింది. అక్రమాలకు అండగా నిలిచిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. బాధ్యులైన అధికారుల నుంచి పరిహారం వసూలు చేయాలని ఆదేశించింది. ఈ కమిటీలో కేంద్ర అటవీశాఖ, రాష్ట్ర గనులశాఖ, పీసీబీ అధికారులు, విశాఖ కలెక్టర్‌ సభ్యులుగా ఉండనున్నారు. అక్రమ మైనింగ్‌ జరిగిన ప్రాంతంలో పర్యటించి మైనింగ్‌ అనుమతులు, పరిధి, రోడ్డు నిర్మాణం, అక్రమ మైనింగ్‌పై సమగ్ర నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని