AP News: ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే దాదాపు రెట్టింపయ్యాయి. గడచిన 24 గంటల్లో 36,452 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 1,831 కరోనా

Updated : 11 Jan 2022 20:44 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే దాదాపు రెట్టింపయ్యాయి. గడచిన 24 గంటల్లో 36,452 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 1,831 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ బారి నుంచి నిన్న 242 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,195 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 467, విశాఖ జిల్లాలో 295, కృష్ణా జిల్లాలో 190, గుంటూరు జిల్లాలో 164, అనంతపురం జిల్లాలో 161, తూర్పు గోదావరిలో 84, కడప జిల్లాలో 20, నెల్లూరులో 129, శ్రీకాకుళం జిల్లాలో 122, విజయనగరంలో 40, పశ్చిమగోదావరిలో 57, ప్రకాశం జిల్లాలో 46, కర్నూలు జిల్లాలో 56 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. గత కొద్దిరోజులుగా ఐదారు జిల్లాల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌ నేపథ్యంలో ఈనెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ విధించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని