AP News: ఏపీలో కొత్తగా 12,615 కరోనా కేసులు.. ఐదుగురి మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ కొవిడ్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 47,420 నమూనాలు పరీక్షించగా..

Updated : 20 Jan 2022 18:28 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ కొవిడ్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 47,420 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 12,615 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ వల్ల నిన్న విశాఖ జిల్లాలో ముగ్గురు, చిత్తూరు, నెల్లూరులో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.  కరోనా బారి నుంచి నిన్న 3,674 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 53,871 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2,338, విశాఖ జిల్లాలో 2,117 కరోనా కేసులు నమోదయ్యాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని