AP News: ఏపీలో కొత్తగా 13,212కరోనా కేసులు.. ఐదుగురి మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 44,516 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా

Updated : 21 Jan 2022 21:55 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 44,516 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 13,212 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ వల్ల నిన్న విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరులో ఒకరు, నెల్లూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు. కరోనా బారి నుంచి నిన్న 2,942 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 64,136 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అత్యధికంగా  విశాఖ జిల్లాలో 2,244, చిత్తూరు జిల్లాలో 1,585, అనంతపురంలో 1,235, శ్రీకాకుళం జిల్లాలో 1,230 కేసులో నమోదయ్యాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు