TS News: తెలంగాణ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా

తెలంగాణ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం నగరంలోని గచ్చిబౌలి ఏఐజీలో ఆయన చికిత్స

Updated : 25 Nov 2021 16:09 IST

హైదరాబాద్‌: తెలంగాణ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం నగరంలోని గచ్చిబౌలి ఏఐజీలో ఆయన చికిత్స పొందుతున్నారు. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా నిన్న రాత్రి చేయించిన పరీక్షలో కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిందని పోచారం చెప్పారు. తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వివరించారు. వైద్యుల సూచనల మేరకు ఆస్పత్రిలో చేరినట్లు పోచారం తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన, సన్నిహితంగా ఉన్న వారు కరోనా పరీక్ష చేయించుకోవాలని ఆయన సూచించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని