Ap Corona: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 547 కొవిడ్‌ కేసులు.. ఒకరు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 33,339 పరీక్షలు నిర్వహించగా.. 547 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసులు 20,78,923కి చేరాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల...

Published : 06 Jan 2022 18:05 IST

అమరావతి‌: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 33,339 పరీక్షలు నిర్వహించగా.. 547 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసులు 20,78,923కి చేరాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల విశాఖ జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,500కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 128 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,62,157 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,266 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని