ap corona update: ఏపీలో కొత్తగా 332 కరోనా కేసులు..ఏడుగురి మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 29,243 మంది నమూనాలు పరీక్షించగా 332 కొత్త కేసులు నమోదయ్యాయి.

Published : 16 Oct 2021 17:55 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 29,243 మంది నమూనాలు పరీక్షించగా 332 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఏడుగురు మృతి చెందారు. కరోనా బారి నుంచి నిన్న 585 మంది కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,193 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని తెలిపింది. కొవిడ్‌ వల్ల కడప, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు, తూర్పు గోదావరి, గుంటూరు, విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని