Karnataka: బంగారు గొలుసును మింగేసిన ఆవు.. తర్వాత ఏం జరిగిందంటే..?
కర్ణాటకలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ ఆవు బంగారు గొలుసును మింగేయగా.. శస్త్రచికిత్స ద్వారా ఆ గొలుసును బయటకు తీశారు......
బెంగళూరు: కర్ణాటకలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ ఆవు బంగారు గొలుసును మింగేయడంతో.. శస్త్రచికిత్స ద్వారా ఆ గొలుసును బయటకు తీశారు. హీపనహళ్లికి చెందిన శ్రీకాంత్ హెగ్డే అనే రైతు దీపావళి పండగ రోజున ఇంట్లో గోపూజ నిర్వహించాడు. ఓ ఆవు, దూడను శుభ్రంగా కడిగి వాటికి పూల దండలు, బంగారు గొలుసులు వేసి ముస్తాబు చేశారు. ఆవు మెడలో 20 గ్రాముల బంగారు గొలుసు తొడిగారు. పూజ అనంతరం అలంకారాలను తొలగిస్తుండగా ఆ 20 గ్రాముల గొలుసు కనిపించలేదు. దీంతో దాని కోసం ఇళ్లంతా వెతికారు. గోశాలలో వెతికినా దొరకలేదు.
అయితే, ఆ గొలుసును ఆవు మింగేసి ఉంటుందని అనుమానించిన కుటుంబసభ్యులు కొద్దిరోజులపాటు ప్రతిరోజు ఆ ఆవు పేడలో వెతికారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో చివరి ప్రయత్నంగా.. ఓ పశువైద్యుడిని ఆశ్రయించారు. కాగా మెటల్ డిటెక్టర్ను ఉపయోగించి ఆ గొలుసు ఆవు పొట్టలోనే ఉందని డాక్టర్ నిర్ధరించారు. కుటుంబసభ్యుల అభ్యర్థన మేరకు.. ఆ గోవుకు పలుమార్లు స్కానింగ్ చేసి శస్త్రచికిత్స ద్వారా ఆ గొలుసును బయటకు తీశారు. ప్రస్తుతం ఆవు ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యుడు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య