Karnataka: బంగారు గొలుసును మింగేసిన ఆవు.. తర్వాత ఏం జరిగిందంటే..?

కర్ణాటకలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ ఆవు బంగారు గొలుసును మింగేయగా.. శస్త్రచికిత్స ద్వారా ఆ గొలుసును బయటకు తీశారు......

Updated : 12 Dec 2021 04:48 IST

బెంగళూరు: కర్ణాటకలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ ఆవు బంగారు గొలుసును మింగేయడంతో.. శస్త్రచికిత్స ద్వారా ఆ గొలుసును బయటకు తీశారు. హీపనహళ్లికి చెందిన శ్రీకాంత్‌ హెగ్డే అనే రైతు దీపావళి పండగ రోజున ఇంట్లో గోపూజ నిర్వహించాడు. ఓ ఆవు, దూడను శుభ్రంగా కడిగి వాటికి పూల దండలు, బంగారు గొలుసులు వేసి ముస్తాబు చేశారు. ఆవు మెడలో 20 గ్రాముల బంగారు గొలుసు తొడిగారు. పూజ అనంతరం అలంకారాలను తొలగిస్తుండగా ఆ 20 గ్రాముల గొలుసు కనిపించలేదు. దీంతో దాని కోసం ఇళ్లంతా వెతికారు. గోశాలలో వెతికినా దొరకలేదు.

అయితే, ఆ గొలుసును ఆవు మింగేసి ఉంటుందని అనుమానించిన కుటుంబసభ్యులు కొద్దిరోజులపాటు ప్రతిరోజు ఆ ఆవు పేడలో వెతికారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో చివరి ప్రయత్నంగా.. ఓ పశువైద్యుడిని ఆశ్రయించారు. కాగా మెటల్‌ డిటెక్టర్‌ను ఉపయోగించి ఆ గొలుసు ఆవు పొట్టలోనే ఉందని డాక్టర్‌ నిర్ధరించారు.  కుటుంబసభ్యుల అభ్యర్థన మేరకు.. ఆ గోవుకు పలుమార్లు స్కానింగ్‌ చేసి శస్త్రచికిత్స ద్వారా ఆ గొలుసును బయటకు తీశారు. ప్రస్తుతం ఆవు ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యుడు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు