TTD: 27న శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ.. ప్రకటించిన తితిదే

తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) విడుదల చేయనుంది. ఈ నెల 27వ తేదీ ఉదయం 9 గంటలకు డిసెంబరు నెలకు...

Updated : 25 Nov 2021 19:07 IST

తిరుమల: తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) విడుదల చేయనుంది. ఈ నెల 27వ తేదీ ఉదయం 9 గంటలకు డిసెంబరు నెలకు సంబంధించిన సర్వదర్శనం టోకెన్లను విడుదల చేయనున్నట్లు తితిదే ప్రకటించింది. వసతి గదులకు సంబంధించి డిసెంబర్ నెల కోటాను నవంబరు 28వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు తితిదే తెలిపింది. గత రెండు నెలలుగా సర్వదర్శనం టోకెన్లను ఆన్‌లైన్ ద్వారానే తితిదే విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని