Thirumala: తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు పడే ప్రాంతాలను గుర్తించిన నిపుణుల బృందం
తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు పడిన ప్రాంతాన్ని ఐఐటీ నిపుణుల బృందం పరిశీలించింది. దిల్లీ ఐఐటీ ప్రొఫెసర్ కేఎస్ రావుతో కూడిన బృందం కనుమదారిని
తిరుమల: తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు పడిన ప్రాంతాన్ని ఐఐటీ నిపుణుల బృందం పరిశీలించింది. దిల్లీ ఐఐటీ ప్రొఫెసర్ కేఎస్ రావుతో కూడిన బృందం కనుమదారిని పూర్తిగా పరిశీలించారు. భారీ బండరాళ్లు పడిన భాష్యకారుల సన్నిధి ప్రాంతంలో మరో బండరాయి పడే అవకాశం ఉండటంతో డ్రోన్ కెమెరా ద్వారా పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ కేఎస్ రావు మాట్లాడుతూ... ఎగువ ఘాట్రోడ్డులో కొండచరియలు పడే 12 ప్రాంతాలను గుర్తించామన్నారు. ప్రస్తుతం దెబ్బతిన్న రోడ్డును అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించి మరమ్మతులు చేయవచ్చని తెలిపారు. అధిక వర్షాల కారణంగానే ప్రమాదం జరిగిందని, 30 నుంచి 40 టన్నుల బరువున్న బండరాళ్లు కొండపై నుంచి జారిపడ్డాయని వివరించారు. దెబ్బతిన్న రోడ్డును పూర్తిగా అందుబాటులోకి తెచ్చేందుకు 3 నెలలకుపైగా సమయం పట్టే అవకాశముందన్నారు. మరో మారు పరిశీలించి పూర్తి నివేదికను తితిదేకు సమర్పిస్తామన్నారు. తిరుమలకు ప్రత్యామ్నాయ రహదారి ఉంటే మంచిదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరో వైపు ఘాట్రోడ్లో పడిన బండరాళ్లను తితిదే తొలగిస్తోంది. లింకు రోడ్డు వద్దకు భారీ బండరాళ్లు దొర్లుకుంటూ రావడంతో ఆ ప్రాంతంలో మరి కొన్ని చెట్లు, రాళ్లు పడిపోయాయి. రాళ్లను యంత్రాల సాయంతో పగులగొట్టి తొలగిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
రాష్ట్రంలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!